హైదరాబాద్ : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7వ తరగతి నుంచి 10 వరకు ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆసక్తి గల విదార్థులు http ://telanganams.cgg.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
దరఖాస్తులు చేసుకున్న వారికి జూన్ 5, 6న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.