గొల్లపల్లి, జూన్ 23 : సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారింద ని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో జగిత్యాల ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 61 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన రూ.61,82,192 విలువైన చెక్కులను, 35 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీచేశారు.