జమ్మికుంట, సెప్టెంబర్ 17: హుజూరాబాద్ నియోజకవర్గం గులాబీ జెండాకు అడ్డా అని, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి మరోసారి టీఆర్ఎస్కే అవకాశం ఇవ్వాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. టీఆర్ఎస్కే ఓటేస్తామని ఓటర్లు హామీ ఇచ్పారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీకి ఓటేస్తే హుజూరాబాద్ ప్రజలు నష్టపోతారని, ఆ పార్టీకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడు..?, బీజేపీలో ఎందుకు చేరాడో? చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ను వీడిన ఈటలకు బీజేపీ నుంచి గెలిచే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ అర్బన్ శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్ పాల్గొన్నారు