సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి
నెలాఖరు నాటికి ఇంటింటికీ మినరల్ వాటర్ అందించాలి
డీలర్లు అక్రమాలకు పాల్పడితే సహించం
టీకా వేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి l ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
ఊట్కూర్, ఏప్రిల్ 8 : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎం పీపీ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎమ్మె ల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పాలకవర్గాలు, అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే పా ర్కుల అభివృద్ధి, హరితహారం, కాలనీల్లో వివిధ సౌకర్యా లు, తాగు నీటి సరఫరా, మెరుగైన విద్యుత్ సరఫరా నిమి త్తం సబ్స్టేషన్ల నిర్మాణం, అవసరమైన చోట అదనపు వి ద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశామన్నారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నా రు.
గ్రామాల్లో బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకు సర్పంచులు శ్రద్ధ చూపాలన్నారు. మురుగు కాల్వలను క్ర మం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఫాగింగ్ నిర్వహించి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు, కుమారులు పెత్తనం చెలాయిస్తూ ఇబ్బందులు సృ ష్టిస్తే ఏ మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. గ్రామా ల్లో మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణం పనులను ఈ నెల 30 నాటికి పూర్తి చేసి ఇంటింటికీ మినరల్ వాటర్ను అం దించాలని, పనులు పూర్తి కాని గ్రామాల్లో సంబంధిత కాం ట్రాక్టర్ల బిల్లులు నిలిపివేయాలని ఆర్డబ్లూఎస్ ఏఈ వెంకటేశ్ను ఆదేశించారు. ఈ నెల రేషన్ దుకాణాల ద్వారా ప్ర భుత్వం లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేపట్టిందని, డీలర్లు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్తో కలిసి అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తామని, నిధుల దుర్వియోగానికి పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పె ద్ద చెరువు లోతును పెంచేందు కు చర్యలు చేపట్టాలని, రైతు బీమా పొందేందుకు అర్హత కలిగిన రైతుల సమాచారం అందజేయాలని సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి కోరగా ఈఏడాది ఊ ట్కూర్ పెద్ద చెరువుతో పాటు మండలంలోని మిగతా గ్రా మాల్లో చెరువుల తూముల నిర్మాణం, మరమ్మతు పనుల ను పూర్తి స్థాయిలో చేపట్టాలని ఇరిగేషన్ ఏఈ వెంకటప్ప ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈజీఎస్ నిధులతో చెరువు కట్టలపై ముళ్లపొదలను పూర్తిగా తొలగించాలని, ఒండ్రు మట్టి ని తరలించి చెరువు లోతట్టును పెంచుకోవాలని సూచించారు. ఐకేపీ బుక్ కీపర్లు జీతానికి తోడు బ్యాంకు ద్వారా రుణం తీసుకున్న మహిళా సంఘం సభ్యుల నుంచి డబ్బు లు తీసుకుంటున్నారని ఎంపీపీ లక్ష్మి ఐకేపీ ఏపీఎంను స మావేశంలో ప్రశ్నించారు. ఇక ముందు అలా జరుగనివ్వద్దని ఆదేశించారు. పులిమామిడి గ్రామ శివారులో రైతు గో పనోళ్ల కాశమ్మ 4 ఎకరాల వ్యవసాయ భూమి రైల్వేలైన్లో పోయినట్లు తప్పుడు రికార్డు కావడంతో రైతు బంధు, రైతు బీమా అందడంలేదని, రైతుకు న్యాయం చేయాలని సర్పం చ్ సూరయ్యగౌడ్ ఎమ్మెల్యేను కోరారు. సమావేశంలో చి న్నపొర్ల ఎంపీటీసీ రవిప్రసాద్రెడ్డి తమ గ్రామానికి 3 కిలోమీటర్ల బీటీ మరమ్మతు చేయించాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ప్రతిపాదనలు పంపాలని పీఆర్ ఏఈ జగత్చంద్రను ఆదేశించారు.
నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి
కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలను పకడ్బందీగా అమలు పరచేందుకు అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించా రు. ప్రజలు దశల వారీగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే తాసిల్దార్, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో కాళప్ప, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్రెడ్డి, ఏవో గణేశ్రెడ్డి, వీఏఎస్ మహదేవ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజ, ఎలక్ట్రిసిటీ ఏఈ వెం కటేశ్ పాల్గొన్నారు.