లోక్సభలో ఎంపీ రాములు
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ): కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని, అప్పు డే అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ ఎంపీ రాములు లోక్సభలో డిమాండ్చేశారు. షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ సవరణ బిల్లు-2021పై శుక్రవారం జరిగిన చర్చలో మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోవడంతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అసమానతలను తొలగించేందుకు వర్గీకరణను చేపట్టాలని కోరా రు. తెలంగాణ ప్రభుత్వం సైతం అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తుచేశారు.