తాడేపల్లి: తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ను తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన గురుమూర్తి.. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.