వనస్థలిపురం, జూన్ 22: కాప్రాయి చెరువు ప్రాంతాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగర్ కాంప్లెక్స్ నుంచి చెరువులోకి వచ్చే వరదనీటిని మళ్లిస్తామన్నారు. అందుకుగాను రూ.93లక్షలతో గేట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పైనుంచి వచ్చే వరదనీరు చెరువులో కలవడం వల్లనే ముంపు సమస్య తలెత్తుతుందన్నారు. వాటిని మళ్లిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. వానకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ డైరెక్టర్ అనిల్చౌదరి, శ్రీధర్గౌడ్, గంగం శివశంకర్, అశోక్రెడ్డి, రాఘవేంద్రరావు పాల్గొన్నారు.