హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రాష్ట్ర అర్చక సమాఖ్య విజ్ఞప్తిచేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని వేలంవేసి.. వచ్చిన డబ్బును ఆయా ఆలయాల దేవుడి పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కోరింది. వడ్డీ ద్వారా వచ్చే సొమ్ముతో ఆలయాలను అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నది. ఈ మేరకు సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. కరోనాతో ఇబ్బందిపడుతున్న అర్చకులను ఆదుకోవాలని విజ్ఙప్తిచేశారు. వైరస్బారినపడిన అర్చకులకు వైద్యఖర్చుల కోసం అర్చక వెల్ఫే ర్ ట్రస్టు నుంచి రూ.ఐదు లక్షల చొప్పున మంజూరుచేయాలని విన్నవించారు.