హైదరాబాద్ : నగరంలోని జీనోమ్ వాలీలో గురువారం నాడు క్యాచ్ ద రెయిన్ కాంపేయిన్ ను నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ జి. అశోక్ కుమార్, ఐసిఎంఆర్ సలహాదారు బిపి ఆచార్య, డైరెక్టర్ ఎన్ఐఆర్ఎఫ్ డాక్టర్ ఎస్జీ రామచంద్ర లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ జి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. భూమి మీద పడే ప్రతి వర్షపు చుక్కను సంరంక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. వర్షం పడిన చోటే ఆనీటిని ఒడసి పట్టాలన్నారు. జల వనరులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం బయోలాజికల్ ఇ, ఐకెపి నాలెడ్జ్ పార్కులను ఆయన ప్రారంభించారు. ఐఏఎల్ఏ కమిషనర్ కేటీ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.