డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రస్తుత సీపీ కమలాసన్రెడ్డికి ఆదేశాలు
రామగుండం సీపీగా ఏసీబీ జేడీ రమణకుమార్
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రామగుండం పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న సత్యనారాయణ కరీంనగర్కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ సీపీగా పనిచేస్తున్న వీబీ కమలాసన్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. కాగా, ప్రస్తుతం ఏసీబీలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రమణకుమార్ను రామగుండం సీపీగా నియమించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.