హైదరాబాద్, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ (పీఆర్ఎంఈయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆ యూనియన్ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్షులు తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా జనగామ నాగరాజు, అధ్యక్షుడిగా ఏ సత్యనారాయణరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీనివాస్రావు, ప్రధాన కార్యదర్శిగా ఏ నందకుమార్ను ఎన్నుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోనున్నట్టు అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు.