జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు తీరును ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ఎల్లా గంగానర్సు రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!