బాసెల్: స్విస్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 21-16, 23-21తో బుసానన్(థాయ్లాండ్)పై విజయం సాధించింది. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు వరుస గేమ్ల్లో ప్రత్యర్థి పనిపట్టింది. సెమీస్లో డెన్మార్క్కు చెందిన నాలుగో సీడ్ మియా బ్లిచ్ఫీల్డ్తో ఈ తెలుగమ్మాయి తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ 21-19, 21-15తో కాంటపోన్పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించాడు. మిగతా మ్యాచ్ల్లో సాయి ప్రణీత్ 14-21, 17-21తో లీ జీ(మలేషియా) చేతిలో.. అజయ్ జయరామ్ 9-21, 6-21తో వితిస్రాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్సాయి రాజ్ రాంకీరెడ్డి, అశ్విని పొనప్ప జోడీ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.