Telangana
- Dec 31, 2020 , 08:14:23
సారస్వత పరిషత్తు పరీక్ష ఫీజు గడువు 25

హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్తు పరీక్షలకు జనవరి 25లోపు ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. ప్రాథమిక, ప్రవేశ, విశారద, పూర్వ ఉత్తర భాగాలు అనే నాలుగు స్థాయిల్లో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణులైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణతకు సమానంగా పరిగణించనున్నారు. ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులైతే సర్వీస్ కమిషన్ నిర్వహించే సెకండ్ క్లాస్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణతతో సమానమని వెల్లడించారు. వివరాలకు 040–24753724, 9603727234 నంబర్లలో లేదా అబిడ్స్ తిలక్రోడ్డులోని సారస్వత పరిషత్తో సంప్రదించాలన్నారు.
తాజావార్తలు
- పరిశ్రమలకు పెద్దపీట
- 15 గంటల్లో పట్టేశారు
- మొబైల్ యాప్లో బడ్జెట్
- ఒకే కాన్పులో ముగ్గురు..
- రైళ్లలో అరటి పండ్ల రవాణా
- టాప్ గేర్లో స్విఫ్ట్
- సరికొత్త ఆల్ట్రోజ్ ప్రారంభ ధర 8.26 లక్షలు
- కేశవాపూర్ ఏఎన్ఎంకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
- అల్ట్రాటెక్ లాభం రూ.1,584 కోట్లు
- తల్లీబిడ్డల సంరక్షణకే మాతాశిశు దవాఖాన
MOST READ
TRENDING