ఆదిలాబాద్ : కొవిడ్ మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి గొప్ప సేవలందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీహరి రావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి కాపాడటం కోసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరాయంగా పని చేస్తున్నారని అన్నారు. త్వరలో మున్సిపల్ కార్మికులను, వైద్య, పోలీసు సిబ్బందిని సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ శ్రీహరి రావును శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేశవాపురం లిఫ్ట్కు శంకుస్థాపన
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్