ఆర్మూర్, మార్చి 28 : తాళం వేసిన ఇండ్లు, రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్.. ప్రాంతం ఏదైనా డివిజన్ పరిధిలో దుండగులు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఆర్మూర్ పట్టణవాసులు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తిరిగి వచ్చేలోగా ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
బస్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమాయకులను టార్గెట్ చేసుకొని వేలాది రూపాయల విలువచేసే స్మార్ట్ఫోన్లను కండ్లు మూసితెరిచేలోగా ఎత్తుకెళ్తున్నారు. జేబులు కత్తిరిస్తూ పర్సులను ఎత్తుకెళ్తున్నారు. ఇండ్ల ముందు వాహనాలను నిలిపి ఉంచాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. రాత్రి అయ్యిదంటే ఆలయాల్లోని దేవతామూర్తుల ఆభరణాలు, హుండీల్లోని నగదును ఎత్తుకెళ్తున్నారు. ఎంతో కష్టపడి రైతులు సాగుచేసిన పసుపునూ వదలడం లేదు. నిఘా అంతంతమాత్రంగానే ఉండడంతో దొంగలు రెచ్చిపోతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు రికవరీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళ్తున్న వారితో కొన్ని సందర్భాల్లో పోలీసులు ‘ఫిర్యాదు తీసుకుంటాం.. కేసు నమోదు చేయడం ఎందుకు? మీ వస్తువులు దొరికితే కోర్టుకు వెళ్లి తీసుకోవాల్సి వస్తుంది అని నచ్చజెప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి చోరీలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డివిజన్పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని చోరీలు…
ఇవీ కూడా చదవండి..
ఒకటికంటే ఎక్కువ పాన్కార్డులుంటే భారీ పెనాల్టీ
వాట్సాప్లో కొత్త ఫీచర్.. అదేమిటంటే..