వనస్థలిపురం, జూలై 7: రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడం లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం వనస్థలిపురం డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డితో కలిసి వెంకటరమణ కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభం, రేడియో కాలనీలో మహిళా భవన్ ప్రారంభం, మల్లికార్జున నగర్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు రాజకీయాలను పరిశీలించాలన్నారు. అభివృద్ధే ఏకైక అజెండాగా తాము పనిచేస్తున్నామన్నారు. కొంతమంది అభివృద్ధి చేతకాక దాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రపంచ స్థాయి అభివృద్ధి నమూనాలను ఎల్బీనగర్లో చేయబోతున్నామన్నారు. అనంతరం అభ్యుదయనగర్ కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, లగ్గోని శ్రీధర్గౌడ్, వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు సతీశ్రెడ్డి, ప్రధానకార్యదర్శి కిషన్గౌడ్, రేడియో కాలనీ అధ్యక్షుడు కటకం వెంకటేశ్, వ్యాస్కుమార్, మల్లికార్జుననగర్ పి.నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్కే ఆరీఫ్, అభ్యుదయ నగర్ అధ్యక్షుడు ఎం.గంగారెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్, జూలై 7: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆటోనగర్లో రూ. 2.50 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇంజినీరింగ్ ఆపరేషన్ సరూర్నగర్ సర్కిల్ కార్యాలయం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ విభాగానికి చెందిన అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం వలన పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ కరుణాకర్, డీఈలు జె.శ్రీనివాస్, విజయభాస్కర్ రెడ్డి, యాదగిరి, వెంకటేశ్వర్లు, ఏడీలు సరూర్నగర్, రాజేందర్ రెడ్డి, సీహెచ్. శ్రీనివాస్, ఏఈ కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.