సంగారెడ్డి : సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత రెండు మూడు రోజులుగా జలుబుతో బాధపడుతున్న ఎస్పీ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. కరోన లక్షణాలు ఏమీ లేకపోయినా పాజిటివ్గా రావడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. అయితే ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా సోకింది.