నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ వెనుక బాటుకు జానారెడ్డే కారణమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అనుమల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అయిదు దశాబ్దాల కాలంలో సాగర్ ఎడమ కాలువ కింద 70 వేల ఎకరాలను ఎండ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. అందులో 35 ఏండ్లు శాసనసభ్యుడిగా, 14 సంవత్సరాలు మంత్రిగా అధికారం చేలాయించింది కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు.
అటువంటి అభ్యర్థికి ఓట్లు వేయమని ఏ మొహం పెట్టుకొని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు 2018 లోనే ఆయనను తిరస్కరించారని మంత్రి గుర్తు చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయె అని గెలిచేది నోముల భగతేనని అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహాత్య