సంగారెడ్డి : జిల్లా జైలు ఖైదీలు సంగారెడ్డి శిశుగృహకు ఊయలను బహూకరించారు. సంగారెడ్డి జిల్లాలో శిశువులను వదిలించుకునే సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. దీంతో అధికారులు సంగారెడ్డి శిశుగృహలో ఊయలను ఏర్పాటు చేశారు. తమకు భారంగా భావించిన శిశువులను తల్లిదండ్రులు ఈ ఊయలలో ఉంచి వెళ్లిపోవచ్చు. వీరి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే అన్ని విధాలుగా చూసుకుంటుంది.
ఖైదీలు జిల్లా జైలులో స్టీల్ సమాన్లు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టీల్ ఊయలను తయారు చేసి సంగారెడ్డి శిశుగృహకు అందజేశారు. ఈ ఊయలను శిశుగృహలో శాస్వతంగా ఉంచనున్నారు. మార్కెట్ నుంచి ఊయల తీసుకువస్తే అది ఎక్కువ కాలం మనలేదని భావించి తానే ఖైదీలతో ఈ స్టీల్ ఊయలను తయారు చేయించినట్లు జైలు సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్ తెలిపారు. కాగా పుట్టికతోనే ఏ శిశువు అనాథ అయ్యే స్థితి తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.