Telangana
- Jan 03, 2021 , 18:56:01
జాతీయ రహదారి-65పై ప్రమాద ప్రదేశాల గుర్తింపు

సంగారెడ్డి : జాతీయ రహదారి-65ను సంగారెడ్డి డీఎస్పీ ఏ.బాలాజీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న మూడు ప్రాంతాలను డీఎస్పీ గుర్తించారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి జంక్షన్, ఐఐటీ-హైదరాబాద్ సమీప ప్రాంతం, కవలంపేట్ గ్రామాల్లో ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ మూడు ప్రదేశాల్లో ప్రాథమికంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఈ ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల నివేదికను అందజేయాల్సిందిగా ఆదేశించారు. అతి త్వరలోనే ఈ ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరాజ్, రూరల్ ఎస్ఐ సుభాష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్సర్య్కూట్తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
- చరిత్రలో ఈరోజు.. బ్రిటిష్ గవర్నర్పై బాంబు విసిరిన దేశభక్తుడతడు..
MOST READ
TRENDING