హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇసు క విక్రయాల ద్వారా రూ. 1000 కోట్లు ఆర్జించాలని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిర్ణయించింది. తొలి త్రైమాసికంలో దాదాపు రూ.300 కోట్లు సాధించిన సం స్థ రూ.1000 కోట్ల లక్ష్యానికి అనుగుణంగా ఇసుక నిల్వలు పెంచుకుంటున్నది. కొత్త రీచ్ల ద్వారా మరింత ఇసుక సరఫరాకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర నగరాల్లో పెద్దఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇటీవలే నగరపాలక సంస్థ అనుమతులు జారీచేసింది. దీనికితోడు నూతన సచివాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వ భవనాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం భారీగా సాగుతున్నది. దీంతో ఈ ఏడాది ఇసుక విక్రయాలు భారీగా పెరిగాయి.