వరంగల్ : ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో భూపాలపల్లికి వెళ్తున్నది. మందారిపేట వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక లారీ బస్సును ఢీకొట్టడంతో ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం పరకాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇసుక లారీ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడిపిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు