న్యూఢిల్లీ: దేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతి సెమీకండక్టర్ కంపెనీకి భారత్ 1 బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.7311 కోట్లు) నగదును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్ఫోన్ అసెంబ్లీ పరిశ్రమను నిర్మించి ఎలక్ట్రానిక్స్ సరఫరా చైన్ను బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఆఫర్ ప్రకటించినట్లుగా తెలుస్తున్నది. ఈ విషయాన్ని కేంద్రంలోని ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ డ్రైవ్.. చైనా తర్వాత భారతదేశాన్ని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా మార్చడానికి సహాయపడింది. దేశంలో చిప్ కంపెనీలు స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది.
‘చిప్ ఫాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతి కంపెనీకి ప్రభుత్వం 1 బిలియన్ డాలర్లకు పైగా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నది’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ‘ప్రభుత్వం కొనుగోలుదారు అవుతుందని మేం వారికి భరోసా ఇస్తున్నాం. ప్రైవేట్ మార్కెట్లో కూడా కంపెనీలు స్థానికంగా తయారుచేసిన చిప్స్ కొనడానికి ఆదేశాలు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు.
నగదు ప్రోత్సాహకాలను ఎలా పంపిణీ చేయాలో ఇంకా నిర్ణయించలేదు. దీనిపై ప్రభుత్వం పరిశ్రమల అభిప్రాయాన్ని కోరింది. చిప్ కొరత ఆటో, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆశ్రయిస్తుంది. వీటి సరఫరా కోసం ప్రపంచం తైవాన్పై ఆధారపడటాన్ని హైలైట్ చేస్తున్నందున.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి సబ్సిడీ ఇస్తున్నాయి.
గత ఏడాది సరిహద్దు వాగ్వివాదాల అనంతరం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ తన ఎలక్ట్రానిక్స్, టెలికాం పరిశ్రమకు నమ్మకమైన సరఫరాదారులను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నది.
స్థానికంగా తయారైన చిప్స్ విశ్వసనీయ వనరులుగా గుర్తించబడతాయి. సీసీటీవీ కెమెరాల నుంచి 5 జీ పరికరాల వరకు అన్ని రకాల ఉత్పత్తులలో చిప్స్ ఉపయోగించవచ్చు. అయితే, ఏ సెమీ కండక్టర్ కంపెనీ భారత గడ్డపై చిప్స్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఆసక్తి చూపించాయనే విషయాన్ని మాత్రం ఆ వర్గాలు వెల్లడించలేదు.
డబ్ల్యూహెచ్ఓకు మొత్తం కొవిడ్ డాటా ఇచ్చాం : చైనా శాస్త్రవేత్త స్పష్టీకరణ
ఫ్రస్టేషన్లో టార్చిలైట్ విసిరివేసిన కమల్ హాసన్
ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు : చివరి ముగ్గురు నిందితులు విడుదల
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేవారికి కుచించుకుపోనున్న గుండె.. వ్యోమగాములపై పరిశోధన
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..