నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటికి అధిక ప్రాధాన్యంత ఇస్తుందని శాలిగౌరారం ఎంపీపీ గంట లక్ష్మమ్మ అన్నారు. సోమవారం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంటలకు సాగు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.