Telangana
- Jan 20, 2021 , 01:26:55
VIDEOS
యాదాద్రికి సాలహార విగ్రహాలు

ఆలేరు :ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మంగళవారం ఉదయం 32 సాలహార విగ్రహాలను యాదాద్రి క్షేత్రానికి తరలించారు. మిగతా 108 విగ్రహాలను సైతం త్వరలో తీసుకురానున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, సాలహార విగ్రహాలను అమర్చే పనులు త్వరలో చేపట్టనున్నట్టు వైటీడీఏ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- పల్లాకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలి
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం
- నిబంధనల ప్రకారం ఎన్నిక నిర్వహించండి
- సామాజిక బాధ్యతగా టీకా తీసుకోవాలి
- మేడారం హుండీలు భద్రమేనా?
- ఉన్నొక్కటీ పనిరాదు
- ప్రజల అండతో టీఆర్ఎస్ బలోపేతం
- బంజారాలను గుర్తించింది కేసీఆరే..
- పల్లా గెలుపుతోనే సమస్యలు పరిష్కారం
- పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
MOST READ
TRENDING