హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అస్వస్థతకు గురై తార్నాక దవాఖానలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఏ జగన్మోహన్రెడ్డిని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పరామర్శించారు. గురువారం దవాఖానకు వెళ్లిన సజ్జనార్.. జగన్మోహన్రెడ్డి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని మెరుగైన వైద్యం అందించేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కంటోన్మెంట్ డిపోలో డ్రైవర్ అయిన జగన్మోహన్రెడ్డి ఈ నెల 7న విధుల్లో ఉండగా శరీరమంతా తిమ్మిర్లు రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. అయినా సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం బారినపడకుండా 30 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.