హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినందున, ప్రయాణికులు సురక్షితంగా ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించవచ్చని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తిచేశారు. సిబ్బంది అందరికీ తొలి, రెండోవిడత కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయినందున ప్రజలు ఆర్టీసీని ఆదరించాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. డిపో నుంచి బయలుదేరే ముందు అన్ని బస్సులను పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థ ఆర్థిక పరిపుష్టి కోసం కార్యాచరణ సిద్ధంచేస్తున్నట్టు వెల్లడించారు.