వక్ఫ్బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీమ్
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు సకాలంలో అండగా నిలబడటం గొప్పసేవ అని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీమ్ అన్నారు. కరోనా బాధితుల కోసం సహాయత ట్రస్ట్, మాహిర్ చారిటీ, దక్కన్ అల్యూమినీ సంస్థలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆదివారం పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమానికి సలీమ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా నుంచి మానవాళిని కాపాడుకొనేందుకు ఎవరికి తోచినవిధంగా వారు సహాయపడుతున్నారని, అందులోభాగంగా ఈ 3 సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కాన్సన్ట్రేటర్లను యూకే నుంచి తెప్పించి పంపిణీ చేయటం గొప్ప సేవ అని అన్నారు. కార్యక్రమంలో సహాయత ట్రస్ట్ చైర్మన్ అనీస్ అహమ్మద్, అమీరుల్లాఖాన్, డాక్టర్ హఫ్సా తదితరులు పాల్గొన్నారు.