నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో విహారించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు.
కృష్ణా నదిలో చూట్టు నల్లమల్ల అడువుల అందాలను విక్షిస్తూ ప్రయాణం చేయడం బావుందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పర్యాటకులు నదీ తీరంలో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.
లాంచీ ప్రయాణంలో నాగార్జునకొండకు అనుమతి లేకపోవడంతో లాంచీ స్టేషన్ నుంచి జాలీ ట్రిప్పులను మాత్రమే నడిపామని, ఈ రోజూ 3 ట్రిప్పులు నడిపినట్లు లాంచీ స్టేషన్ మేనేజర్ హరిబాబు తెలిపారు.