14 టేబుళ్లు.. 25 రౌండ్లు
30 నిమిషాలకో రౌండ్ పూర్తి
నల్లగొండ, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండలో ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు జరుగనున్నది. తొలి సరళి 9 గంటలకు వెలువడనున్నది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉన్నదని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.