నల్లగొండ: కృష్ణమ్మ శాంతించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 34,341 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 40,726 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 589.30 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 309.9534 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.