హైదరాబాద్ : ప్రభుత్వరంగ సంస్థల విక్రయంపై కేంద్రం మరో ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలు విక్రయించే రాష్ర్టాలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. రాష్ర్టాల పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలు విక్రయిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రైవేటీకరణపై రాష్ట్ర ఎంపీల ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్యాల్ సమాధానం ఇస్తూ రాష్ర్టాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని బడ్జెట్లోనే ప్రకటించినట్లు పేర్కొన్నారు.