న్యూఢిల్లీ: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో పీహెచ్పీ డెవలపర్, సీనియర్ డెవలపర్ అనలిటిక్స్, డిజైనర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 16
ఇందులో సీనియర్ డెవలపర్ 3, డెవలపర్ 6, సాఫ్ట్వేర్ టెస్టర్ కమ్ డెవలపర్ 2, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1, కంటెంట్ మేనేజర్ లేదా రైటర్ 2, డిజైనర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిజైనర్, కంటెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, మిగిలిన పోస్టులకు బీఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏలో ఏదోఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 1
వెబ్సైట్: www.meity.gov.in, www.negd.gov.in & www.dic.gov.in