డీపీవో శ్రీనివాస్
ఇంద్రవెల్లిలో సర్వే పరిశీలన
ఇంద్రవెల్లి, మే 10: కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటా ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్ వైద్యసిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలో వైద్య సిబ్బంది సోమవారం నిర్వహించిన ఆరోగ్య సర్వేను ఆయన పరిశీలించారు. జ్వరపీడితులను గుర్తించి మందులు అందించాలన్నారు. వైద్యసిబ్బంది, గ్రామస్తులకు జాగ్రత్తలు, సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీవో సంతోష్, ఈవో శ్రీనివాస్రెడ్డి, ఏఎన్ఎం పద్మ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
ముక్రా(కే)లో..
ఇచ్చోడ, మే 10: మండలంలోని ముక్రా(కే) గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటా ఆరోగ్య సర్వే చేపట్టారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. జ్వరంతో బాధపడుతున్న పది మందిని గుర్తించి వారికి మెడికల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్ నందబాయి, ఆశకార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తపల్లి(హెచ్) గ్రామంలో..
నార్నూర్, మే 10: కొత్తపల్లి(హెచ్) గ్రామంలో నార్నూర్ ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామస్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఈవో చౌహాన్ నాందేవ్ మాట్లాడుతూ కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంటింటా సర్వే చేపట్టామన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉద్దల్, ఈశ్వర్, గోకుల్ పాల్గొన్నారు.