హైదరాబాద్ : రాష్ట్రంలో రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుంది.రూ.25 వేల నుంచి రూ.50 వేలలోపు రుణాలున్న రైతులకు నిధుల విడుదల కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండోరోజు మంగళవారం 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద రూ.100.70 కోట్లు జమ అయ్యాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల రుణమాఫీకి ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. హామీ ప్రకారం ఈ ఏడాది రూ.50 వేల వరకు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. కరోనా విపత్తులోనూ మొత్తం పంటలు కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.