లారీ ఢీకొని సర్పంచ్ కుటుంబం దుర్మరణం
దంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి
నిడమనూరు, ఏప్రిల్ 2 : బావమరిది కొడుకు అన్నప్రాసనకు వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర మాదానికి గురవగా.. దంపతులు సహా ఇద్దరు బిడ్డలు దుర్మరణంచెందారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీను, భార్య విజయ, కుమార్తె శ్రీవిద్య (5), కుమారుడు కన్నయ్య (3)తో కలిసి బైక్పై నిడమనూరు మండలం ముప్పారంలో అన్నప్రాసన కార్యక్రమానికి బయలుదేరారు. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో నిడమనూరులో వాహనాల రాకపోకలు ఒకేవైపు సాగుతున్నాయి. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి అతివేగంగా వెళ్తున్న బియ్యంలారీ ఎదురుగా వస్తున్న టాటా ఏస్ ట్రాలీని ఢీకొట్టి 30 అడుగుల వరకు లాక్కెళ్లింది. అదేసమయంలో టాటా ఏస్ను దాటుతున్న తరి శ్రీను బైక్ పైనుంచి కూడా దూసుకెళ్లింది. దీంతో శ్రీను (35), విజయ (30) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన చిన్నారులను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. టాటా ఏస్ డ్రైవర్ దస్తగిరితోపాటు ముప్పారానికి చెందిన కొల్లి నాగరాజు, అతని కొడుకు యశ్వంత్ తీవ్రంగా గా యపడ్డారు. సర్పంచ్ శ్రీను కుటుంబం మృతిచెందడంపై మంత్రి జగదీశ్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మిర్యాలగూడ దవాఖానలో మృతదేహాల వద్ద నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం