భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పవర్ బ్యాంక్ లాంటి పరికరం పేలడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. చాప్రోడ్ గ్రామానికి చెందిన రామ్ సాహిల్ పాల్ అనే యువకుడు మన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న తన పొలానికి వెళ్తుండగా పవర్ బ్యాంక్ లాంటి పరికరం దొరికింది. తిరిగి ఇంటికి వచ్చాక దానికి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా పరికరం పేలిపోయిందని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ భారతి జాట్ చెప్పారు. పరికరం వివరాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో పేలుడు పరికరం కాదని తేలిందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.