హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల అభివృద్ధికి కొత్త వీసీలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఉచత్తర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. రుసా-3లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. రూసా -1, 2ల కింద రాష్ట్రంలో భారీ మొత్తంలో నిధులను వెచ్చించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా రూసా-3 కింద నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నారు.