మంచిర్యాల : పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, హరితహారం, విద్యుత్ ప్రధాన ఎజెండాగా నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వెంకట్రావుపేట గ్రామంలో బుధవారం పల్లె ప్రగతి గ్రామ సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిపై దేశ అభివృద్ధి ఆధారపడుతుందనే సంకల్పంతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 308 కోట్ల రూపాయలను ప్రతినెల గ్రాంట్గా గ్రామీణ స్థానిక సంస్థలకు మంజూరు చేస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు.
అందులో భాగంగా గత ఇరవై రెండు నెలల కాలంలో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి 6,500 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. అంతకు క్రితం జోడు వాగుల గ్రామంలో హరితహారం కార్యక్రమంలో మంత్రులు మొక్కలను నాటారు. కిష్టంపేట గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక