మేడ్చల్ మల్కాజిగిరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో రూ.77లక్షల, 50 వేలతో వార్డుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా జులై 1 నుంచి ప్రారంభం అయ్యే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయ వంతం అయ్యే విధంగా పని చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.
అలాగే జిల్లాలో నిర్వహించే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి తెలిపారు. ఇంటింటి ఆరు మొక్కలు పంపిణీ చేసి నాటించాలని మంత్రి సూచించారు. జిల్లాలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేసి నాటించే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో కంటే ఎక్కువ మొక్కలు నాటి జిల్లాను హరిత జిల్లాగా మార్చాలని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి