రంగారెడ్డి : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో రూ.50 లక్షల నిధులతో బస్సు టెర్మినల్ను, సిరిగిరిపురం గ్రామంలో పల్లె ప్రగతి పనులను విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో గ్రామంలో పల్లె ప్రగతిలో జరిగిన పనులను వారు పరిశీలించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు వెయ్యికోట్లు వెచ్చించి పల్లె ప్రగతి పనులను చేయిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాలకు అధిక నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సిరిగిరిపురం గ్రామంలో ఇంటిమీద కరెంటు వైర్లు ఉన్నాయని కాసుల నర్సింహ్మ మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే మంత్రి స్పందించి 10రోజులలో ఇంటిపై నుంచి కరెంటు వైర్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సిరిగిరిపురం గ్రామం పల్లె ప్రగతితో ముందంజలో ఉన్నందున ఆ గ్రామానికి రూ.20లక్షలను అబివృద్ధి పనుల కోసం మంజూరు చేశారు.
అర్హులందరికి దశల వారీగా పింఛన్లు, రేషన్కార్డులను అందజేస్తామని ఆయన తెలిపారు. గతంలో ఐదు ఊర్లకు ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవారని ఇప్పుడు ఏగ్రామానికి ఆగ్రామ కార్యదర్శిని ఏర్పాటుచేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలు గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పారు. జిల్లాలో నీటి ఎద్దటికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రైవేటు దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మహేశ్వరం నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలందరు పాల్గొని జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పన్ అనిత, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, పంచాయతి రాజ్ ట్రిబ్యునల్ మెంబర్ గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి