వరంగల్ రూరల్ : గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నడికూడ మండలం ధర్మారం గ్రామం నుంచి పులిగిల్ల గ్రామం వరకు రూ.4.90 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు. ఆయన వెంట పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ రూరల్, అర్బన్ జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, సుధీర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.