పెద్దపల్లిటౌన్, మే 27: శ్రీసత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 40మంది టీచర్లు, అటెండర్లు, ఆయాలకు శ్రీ సత్యసాయి సేవా మందిరం ప్రాంగణంలో నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేవా సంస్థ ఆధ్వర్యంలో రోగులకు ఆహారం, పండ్లు అందజేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారని వివరించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి సేవా సంస్థల జిల్లా సేవాదళ కోఆర్డినేటర్ వై హన్మంతరావు, కన్వీనర్ బొల్లం లక్ష్మీనారాయణ, బాల వికాస్ కోఆర్డినేటర్ జ్యోతి, విజయ్సింగ్ ఠాకూర్, మారుతి, మల్లేశ్వరి, నాగలక్ష్మి, సీసీ సురేందర్ తదితరులు పాలొన్నారు.
నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
సుల్తానాబాద్, మే 27 : పేద కుటుంబాలకు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల మనోహర్రెడ్డి అండగా నిలిచారు. సుల్తానాబాద్కు చెందిన ఓదెల సురేశ్ అనారోగ్యంతో మరణించ గా, ఇంటి యజమాని రానీయకపోవడంతో మేరు సంఘం కమ్యూనిటీ హాల్లో ఉంటున్నారు. వారికి క్వింటాల్ బియ్యం అందించగా, సుగ్లాంపలి మాజీ వార్డు సభ్యులు బొడ్డు ఎల్లమ్మ అనారోగ్యంతో మరణించింది. వారికి ఫౌండేషన్ తరఫున రూ. 3 వేలు అందించారు. ఇక్కడ కౌన్సిలర్ పసెడ్ల మమతసంపత్, బైరగోని ప్రభాకర్, శివరాజ్ తదితరులున్నారు.
పేదింటి యువతికి ..
జూలపల్లి, మే 27: జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన నిరుపేద అడ్డగుంట స్వరూప రాజయ్య కూతురు మమత పెండ్లి ఖర్చుల కోసం జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు గురువారం జడ్పీటీసీ తరఫున రూ. 5 వేలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్కు మమత, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఉప సర్పంచ్ చొప్పరి నర్సింగం, నాయకులు సొల్లు శ్యామ్, చొప్పరి శేఖర్, చిగురు రవీందర్రెడ్డి, చిప్ప రమేశ్, బొద్దుల సాయినాథ్, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్,మే27: పెగడపల్లికి చెందిన ఆర్ఎంపీ కిషన్ ఇటీవల కరోనాతో మృతి చెంద గా, బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట ఆరెల్లి రమేశ్ ఉన్నారు. అలాగే జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి 50కిలోల బియ్యం అందించారు.
పెద్దపల్లి రూరల్, మే 27: పెద్దపల్లి మండలం రాంపల్లికి చెందిన ఏరుకొండ శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబానికి యజ్ఞ ఎంలైట్ సొసైటీ ఆధ్వర్యంలోనిత్యావసరాలు, బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనపర్తి ప్రభాకర్రావు, అంగన్వాడీ టీచర్ రేణుక, సొసైటీ వ్యవస్థాపకుడు పల్లె శాంతి రాజు తదితరులు పాల్గొన్నారు.