మూడు టీంలుగా విభజన 24 గంటలు అందుబాటులో
టోల్ఫ్రీ 08545233525, 7288064701,
వాట్సాప్ నెంబర్ 7675937766
వనపర్తి, మే 15: కరోనాను కట్టడి చేసేందుకు జిల్లాలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని ప్రత్యేక గదిలో ఈ విభాగాన్ని కొనసాగించాలని నిర్ణయించగా టోల్ఫ్రీ నెంబర్లు 08545233525, 7288064701, వాట్సాప్ 7675937766 నెంబర్లను కేటాయించారు. కరోనాకు సంబంధించిన ఎలాంటి సందేహాలైనా నివృత్తి చేయనున్నారు. 24 గంటలపాటు పని చేయనుండగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఎప్పటికప్పుడు ఆరా తీయనున్నారు. ప్రతిరోజూ కొనసాగనుండగా మూడు షిప్టులుగా విధులను నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు విధులను నిర్వహించనున్నారు. ఈ షిప్టులకు నాయబ్ తాసిల్దార్ను ప్రత్యేక అధికారిగా నియమించారు.
ఫిర్యాదు చేయాల్సిన అంశాలు
లాక్డౌన్ ఉల్లంఘనతోపాటు అవసరమైన వస్తువుల కొరత, ధరల పెరుగుదల
శాంతి భద్రతలకు సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు
వైద్య అత్యవసర పరిస్థితులు, మందుల కొరత
టీంల వారీగా అందుబాటులో ఉండే అధికారులు విధులు
టీం 1 : ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నలుగురు అధికారులు, 1 నాయబ్ తాసిల్దార్ అందుబాటులో ఉంటారు. నాయబ్తాసిల్దార్ మోహన్, డీఆర్డీవో కార్యాలయ అధికారి రవి, కానిస్టేబుల్ రాజూనాయక్, ఎంహెచ్ఏ చంద్రమౌళి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్ అందుబాటులో ఉంటారు.
టీం 2 : మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నలుగురు అధికారులు , ఒక నాయబ్ తాసిల్దార్ అందుబాటులో ఉంటారు. నాయబ్తాసిల్దార్ శ్రీకాంత్ రావు , డీఆర్డీవో కార్యాలయ అధికారి మల్లేష్ ,కానిస్టేబుల్ ప్రసాద్ , ఎంపీహెచ్ఏ మధుబాబు , కంప్యూటర్ ఆపరేటర్ భీమయ్య లు అందుబాటులో ఉంటారు.
టీం 3 : రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నలుగురు అధికారులు, ఒకరు నాయబ్ తాసిల్దార్ అందుబాటులో ఉంటారు. నాయబ్తాసిల్దార్ నరేందర్ , డీఆర్డీవో కార్యాలయ అధికారి రాఘవేందర్ రెడ్డి , కానిస్టేబుల్ దశరథ్, ఎంహెచ్ఏ రాంచంద్రయ్య, కంప్యూటర్ ఆపరేటర్ చంటిబాబు అందుబాటులో ఉంటారు.
ప్రజలకు ఉపయోగకరంగా..
కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా ప్రజలకు పలు సమస్య లను పరిష్కార వేదికగా ఉపయోగపడుతుంది. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు , దవాఖానలో చేరాల్సిన వారు ఈ కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వడం ద్వారా మెడికల్ సిబ్బంది వారితో మాట్లాడి సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత జిల్లా వైద్యాధికారికి సమాచారాన్ని చేరవేస్తారు. కంట్రోల్ రూం ద్వారా అందించే సేవలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.