తక్కువ ధరకే కార్లు, ఫ్లాట్లు ఇప్పిస్తానని నమ్మించి.. డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కడప జిల్లా కమలాపురం సొసైటీ కాలనీకి చెం దిన క్యాప నరేంద్రప్రసాద్ శర్మ(30) నగరంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నష్టపోయాడు.. అయితే.. ఈ నష్టాల నుంచి బయటపడడానికి మోసాలు చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇందులో భాగంగా ఇంటి స్థలం, అపార్టుమెంట్లలో ఫాట్లు తక్కువ ధరకే ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడు.
ఇటీవల కేపీహెచ్బీ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎంజీ కారు ఇప్పిస్తానని రూ. 15లక్షలు, మరో వ్యక్తి వద్ద రూ. 3.45లక్షలు కలిపి మొత్తం రూ.18, 45,000లు తీసుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిం దితుడు నరేంద్రప్రసాద్ శర్మను రిమాండ్కు తరలించారు. ఇతడిపై కూ కట్పల్లి, బాచుపల్లి, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇదే తరహా మోసాలకు పాల్పడటంతో కేసులు నమోదై ఉన్నాయని సీఐ తెలిపారు.