హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం కింద రూ.30 కోట్లు మంజూరు చేసిం ది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర చేనేత కార్మికులకు అందించే థ్రిప్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ పథకం (నేతన్నకు చేయూత) కింద ఈ నిధుల వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నేతన్నకు చేయూత పథకానికి అదనంగా రూ.30 కోట్ల నిధులు విడుదలచేసిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ నేతలు ఎల్ రమణ, కర్నాటి విద్యాసాగర్, యర్రమాద వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్తోపాటు పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో రైతులకు రైతుబీమా మాదిరిగానే చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించి దేశంలో ఎక్కడాలేనివిధంగా చేనేతరంగాన్ని ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.