నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలు, జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి చెక్కు రూపంలో అందించారు. ఆదివారం ప్రగతిభవన్లో ఈ మొత్తాన్ని సీఎస్ఆర్ ఫండ్ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ బెడ్స్ ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత మంచిదని మంత్రి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దానికి మన వంతు బాధ్యత కూడా కొంత చేయూతనందించాలని నా ఫ్రెండ్స్ తో మాట్లాడానని మంత్రి తెలిపారు. వారు వెంటనే స్పందించి మీరు డిజైన్ చేయండి మేం డబ్బులు ఇస్తామన్నారు. మొట్టమొదట బాల్కొండ నియోజకవర్గంలో హాస్పిటల్లోని బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మార్చడానికి కార్యక్రమం తీసుకున్నామని పేర్కొన్నారు. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని 30 పడకలలో 25 ఆక్సిజన్, ఐదు ఐసీయూ,
మోర్తాడ్ మొత్తం 30 ఐసీయూ 5, ఆక్సిజన్ 25, వేల్పూర్లో 4 ఐసీయూ మిగతా అన్ని ఆక్సిజన్ బెడ్స్. బాల్కొండ ఐదు ఐసీయూ, మిగతావి ఆక్సిజన్ బెడ్స్ అని, ఆర్మూర్లో 10 ఐసీయూ, మిగతావి ఆక్సిజన్ బెడ్స్, బోధన్లో 5 ఐసీయూ, మిగతావి ఆక్సిజన్, నిజాంబాద్ జీహెచ్లో చిన్న పిల్లల కోసం అలాగే హాస్పిటల్ లో అవసరం ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ నిధులు అందిస్తున్నామని తెలిపారు.
ఇందుకు గాను అనూష ప్రాజెక్ట్ రూ.25 లక్షలు, ఎస్వీసీ కన్స్ట్రక్షన్స్ రూ.25 లక్షలు, కేపీసీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు, ఎస్ ఎల్ ఎమ్ ఐ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు మొత్తం కోటి రూపాయలు వైద్య రంగంలో వసతులు కోసం అందజేసినట్లు మంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు