హైదరాబాద్: మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది చాలా సంతోషకరమైన ఘట్టమని అన్నారు. ఈ విజయం టీఆర్ఎస్కే అంకితమన్నారు. ‘నేనెవరో తెలియకపోయినా వారి ఇంటి ఆడపడచులా భావించి.. నా విజయం కోసం పాటుపడిన పార్టీ నేతలు, కార్యకర్తలకు రుణపడి ఉంటా’ అని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల వాణీదేవి ఇంకా ఏమన్నారంటే..