హైదరాబాద్: తెలుగు అకాడమీలో రూ.43 కోట్లు మాయమయ్యాయి. నగరంలోని తెలుగు అకాడమీ అధికారులు యూనియన్ బ్యాంక్లో రూ.43 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే ఎఫ్డీలు అకౌంట్ నుంచి మాయమయ్యాయని అకాడమీ ప్రతినిథులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తులో అకడమీ అధికారులే డబ్బును విత్డ్రా చేసుకున్నారని బ్యాంక్ అధికారులు తెలిపారు.
హైరదాబాద్లోని హిమాయత్నగర్లో తెలుగు అకాడమీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కాగా, రాష్ట్ర విభజన సందర్భంగా అకాడమీని ఉమ్మడి జాబితాలో చేర్చారు. అయితే సంస్థ నిధులను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో భవనాలు, నగదు వివరాలు లెక్కిస్తుండగా యూబీఐ బ్యాంక్లో ఉన్న రూ.43 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, వాటిని విత్డ్రా చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ డబ్బుకోసం అధికారులు సంబధిత బ్రాంచ్కు వెళ్లగా.. వాటిని ఆగస్టులోనే విత్డ్రా చేశారని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.